
ఫోన్ ట్యాపింగ్ కేసులో మారుతున్న పరిణామాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుతోంది. ఈ కేసులో కేసీఆర్ చుట్టూ బిగిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కేసీఆర్ బృందం మిమ్మల్ని విచారించడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించిన సిట్.. అంతకు ముందు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు తీసుకున్నారు. దర్యాప్తు సిట్ చీఫ్ సజ్జనార్, దర్యాప్తు బృందం నివేదిక సిద్ధం కావడానికి. కేసు నివేదికపై త్వరలోనే నివేదిక ఇస్తారని.
కేటీఆర్ విచారణ
రాజకీయ రణరంగానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్ అధికారులు విచారించారు. బుధవారం హరీష్రావును విచారించిన సిట్ గురువారం కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని వైద్యులు విచారణ చేపట్టారు.. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను సిట్ బృందం వివిధ అంశాలపై ప్రశ్నలు వేసింది. ఇప్పటి వరకు పలువురిని విచారించిన సిట్.. వారిద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయన్ని క్వశ్చన్ చేసింది. ఈ కేసులో అధికారులు, ప్రజా ప్రతినిధులను సిట్ బృందం ప్రశ్నించింది. వారి నుంచి వాంగ్మూలాలను సేకరించింది. వాటి ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ విచారణలో ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సీపీ విజయ్ కుమార్, వైసీపీ వెంకటగిరి ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టు.
ఇక, శుక్రవారం ఉదయం నందిహిల్స్ నుంచి హరీష్రావుతో కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడ ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మహిళా నేతలు ఆయనకు తిలకం దిద్ది ఆశీర్వదించారు. అనంతరం ఆయన ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తననే టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుష్ప్రచారం చేస్తోందని ఇప్పుడు అదేనంటూ విమర్శలు చేశారు. మీడియా సమావేశం తర్వాత హరీష్రావుతో కలిసి సిట్ కార్యాలయానికి కేటీఆర్ వచ్చారు. చాలా దూరంలో అందరి వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం కేటీఆర్ హరీష్ రావు వాహనాలను పీఎస్కి అనుమతి ఇచ్చారు. పీఎస్ వరకు హరీష్రావుతో వచ్చిన కేటీఆర్ ఒక్కడినే విచారణకు అనుమతి ఇచ్చారు. విచారణ జరుగుతున్న టైంలోనే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. తమకు అనుమతి డిమాండ్ చేశాయి. ముందే తమను తమ నేతలను అడ్డుకోవడంపై మండిపడింది. అయినా పోలీసులు వారిని నియంత్రించి అక్కడి నుంచి పంపేశారు. ఇలాంటివి జరుగుతుందని ముందే గ్రహించిన పోలీసులు కట్టుదిట్ట భద్రతామైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థు నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని కొన్ని లీడర్లను ఇంటి నుంచి రానీయలేదు.
ఒకే ప్రశ్న.. పలు రకాలుగా..
ప్రధానంగా కేసీఆర్ టార్గెట్ గా ఈ విచారణ సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తుది నిర్ణయం ఎవరిది..? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పారు.. అందులో మీ పాత్ర ఏమిటి..? అప్పటి సీఎం ఏమైనా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారా..? ఒప్పందం తుది నిర్ణయం ఎవరు తీసుకున్నారు.. అనే ప్రశ్నలు కేటీఆర్ ముందు సిట్ టీం ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తేనే.. ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు అనుమతి ఉంటుందని సిట్ కోరుతోంది.
అదే కారణం..?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ప్రస్తావించడానికి కారణం నాడు జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. అప్పట్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉన్న బీజేపీ నాయకులు ప్రణాళిక రూపొందించారని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ విమర్శలు చేశారు. అంతేకాదు, ఒక ఆడియో కూడా విడుదల చేశారు. అయితే ట్యాపింగ్ వల్లనే ఈ ఆడియో బయటికి వచ్చిందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఆడియోను ఎలా రికార్డ్ చేశారు? ఎక్కడి నుంచి వివరాలు సేకరించారు? అనే విషయాలను పోలీసులు రాబట్టారని. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు పలువురు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కేసీఆర్ ను సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాడు కేసీఆర్ ఆరోపించిన ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కిచెన్ యజమాని నందకుమార్ ను కూడా పోలీసులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. నందకుమార్ ఫోన్ను ట్యాప్ చేయడం ద్వారానే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నాడు కేసీఆర్ గుర్తించారని సిట్ కనిపిస్తోంది.అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశం.. మీడియాలో ప్రసారమైన ఆడియో, వీడియో రికార్డులను కూడా ఇప్పటికే సేకరించారు. వీటి ఆధారంగానే నాటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతలను అడ్డంగా ఇరికించేందుకు కేసీఆర్ ఆడియో టేపులను బయటపెట్టారు. అవే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చాయని పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.
ఇక మిగిలింది కేసీఆరే
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం విచారణ మొత్తం పూర్తి చేసింది. అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారించిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్ ను విచారణకు పిలిచారు. ముందు నుంచీ అప్పటి ఇంటలీజెన్సీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువు పోలీసులు చెప్పిన ఆన్సర్ ఒక్కటే. అప్పటి ప్రభుత్వ పెద్దల జాబితా ప్రకారమే తాము ట్యాపింగ్మని చెప్పుకొచ్చారు. ఇంట్లో భాగంగానే ఇప్పుడు సిట్ టీం.. కేటీఆర్ వరకూ వచ్చింది. కేటీఆర్ విచారణ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తారని టాక్.
