Home సినిమా సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పతంగ్‌’ చిత్రం నుంచి ‘ఎమోసనల్‌ డ్రామా’ లిరికల్‌ వీడియో విడుదలైంది. – MS Live 99 News

సురేష్‌బాబు చేతుల మీదుగా ‘పతంగ్‌’ చిత్రం నుంచి ‘ఎమోసనల్‌ డ్రామా’ లిరికల్‌ వీడియో విడుదలైంది. – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
సురేష్‌బాబు చేతుల మీదుగా 'పతంగ్‌' చిత్రం నుంచి 'ఎమోసనల్‌ డ్రామా' లిరికల్‌ వీడియో విడుదలైంది.
2,807 Views



న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్‌ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు తాజాగా ‘పతంగ్‌’ చిత్ర బృందంతో చేతులు కలిపారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయన ‘పతంగ్‌’ సురేష్ ప్రొడక్షన్స్‌ పతాకంపై తన సమర్పణలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ప‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషన్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది విజ‌య్ శేఖర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్‌రెడ్డి నిర్మాత‌లు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు. ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, డి.సురేష్‌ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ ‘ఎమోసనల్‌ డ్రామా’ అంటూ కొనసాగే ఓ మాసివ్‌ పాటను చిత్ర సమర్పకుడు సురేష్‌బాబు విడుదల చేశారు. శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు కలిసి మాట్లాడుతూ ”కొత్తతరం అంతా ఈ సినిమా చేశారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో రిచ్‌గా చేశారు. నాని బండ్రెడ్డి మంచి క్రియేటివిటి ఉన్న పర్సన్. కెమెరా వర్క్ అన్ని బాగా ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి క్లైమాక్స్‌ను షూట్ చేశారు. ఓ స్టేడియంను తీసుకుని, పతంగుల పోటీ పెట్టి ఎంతో భారీగా ఆ పతాక సన్నివేశాలు తీశారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన నాని బండ్రెడ్డి మాట్లాడుతూ ”సినిమాను, నన్ను నమ్మి సురేష్‌బాబు గారు ఈ సినిమాకు సమర్పకునిగా చేసారు. ఆయనకు నా కృతజ్ఞతలు. కొత్త కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

సంగీత దర్శకుడు జోస్ జిమ్మీ మాట్లాడుతూ ”సురేష్ బాబు గారి చేతుల మీదుగా సాంగ్ విడుదల కావడం ఆనందంగా ఉంది. నేను పుట్టింది కేరళలో అయినా భీమవరంలో పెరిగింది. నా పాటలు, సినిమా అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది.”అన్నారు.

పూజిత్ మాట్లాడుతూ ”ఈ సినిమాలో ప్రతి సాంగ్ అందరిలో హుషారు తెప్పించే విధంగా ఉంటుంది. ఈ పాటలు నా మ్యూజికల్ టేస్ట్‌ను మార్చేశాయి. తప్పకుండా ఇలాంటి ఓ బ్యూటిఫుల్‌ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు” అన్నారు.

ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ ”మా చిన్న సినిమా అందరూ సపోర్ట్ చేయాలి. సినిమాపై మంచి నమ్మకం ఉంది. అందరం కొత్తవాళ్లమే. కష్టపడి ఓ మంచి సినిమా పెద్దగా తీశాం. సురేష్‌బాబు యాడ్‌ అవ్వడంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది. మా సినిమాపై ఉన్న టెన్షన్ అంతా పోయింది. ఎమోసనల్‌ డ్రామా అనే సాంగ్‌ ఎంతో మాసివ్‌గా ఉంటుంది. జోస్‌ జిమ్మీ పాటలు అందరికి నచ్చుతాయి. శ్రీమణి సాంగ్ లిరిక్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఎంతో కష్టపడ్డారు. అందరికి ఈ సినిమా మంచి సక్సెస్‌ను ఇస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “మా సినిమా సురేష్‌బాబు గారి సమర్పణలో రిలీజ్‌ కానుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమాల్లో యూత్‌ ఫెస్టివల్‌లా వుంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మీలో ఉత్సుకతను కలిగిస్తుంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird