
-గృహ హింస కేసు నమోదు చేసిన సెలీనా జైట్లీ
-సెలీనా జైట్లీ ఎవరు
-తెలుగు సినిమాలో చేసిందా
-తన డిమాండ్ ఏంటి!
మంచు విష్ణు(మంచు విష్ణు)నుంచి వచ్చిన అనేక సినిమాల్లో సూర్యం కూడా ఒకటి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భారతీయ నటి ‘సెలీనా జైట్లీ'(Celina jaitly). తొలి చిత్రంతోనే అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో అలరించింది.ఇతర భాషల్లో సత్తా చాటిన సెలీనా 2011లో ఆస్ట్రియా దేశానికి చెందిన ‘పీటర్ హాగ్'(పీటర్ హాగ్)అనే వ్యాపారవేత్త ని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరికి ముగ్గురు పిల్లలు.
రీసెంట్ గా సెలీనా ముంబైలోని జ్యుడిషియల్ మెజిస్రేట్ లో పీటర్ పై గృహ హింస ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అభ్యర్థి పిటిషన్ లో నా భర్త తనని తాను ఎక్కువగా ఊహించుకొనే ఒక నార్సిసిస్ట్. పిల్లలపై ప్రేమ కూడా లేని ఒక సెల్ఫీస్ట్. శారీరకంగా, మానసికంగా నన్ను శస్త్ర చికిత్సలకి గురి చేసాడు.ఆస్ట్రియాలో విడాకులకి అప్లై చేయడంతో ఇండియాకి పారిపోయి వచ్చాను.పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కోల్పోయాను.
నా వర్క్ నన్ను చేసుకోనివ్వకుండా ఏదో ఒక రకంగా అడ్డుపడ్డాడు. దాంతో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయాను. పీటర్ నుంచి నెలకి 10 లక్షల రూపాయల భరణంతో పాటు 50 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలి. నా పిల్లలు నా దగ్గరకి వచ్చేలా కూడా చూడాలని సెలీనా తన పిటిషన్లో ఉంది. వచ్చే నెల డిసెంబర్ 12 కి కోర్టు కేసుని వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: ఏమైంది చిరు.. ఎందుకు అప్ డేట్ ఇవ్వడం లేదు
హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకి చెందిన సెలీనా 2003 లో హిందీ సినీ రంగ ప్రవేశం చేసి అనతి కాలంలోనే అగ్ర హీరోలతో జత కట్టింది. వివాహం తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. 2020 లో సీజన్స్ గ్రీటింగ్స్ అంటే షార్ట్ ఫిలింలో కనపడింది. 2001 ఫెమినా మిస్ ఇండియాగా నిలవడమే కాకుండా అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీల్లో నాలుగో రన్నర్ అప్ గా నిలిచిన రికార్డు సెలీనా సొంతం.


CEO
Mslive 99news
Cell : 9963185599
