- హాజరైన ఇరు రాష్ట్రాల ఆర్యవైశ్య ప్రముఖులు
కల్లూరు జూన్ 8(Mslive99news) ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా కల్లూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు కల్లూరు మండల పరిధిలోని డీయన్ పి కన్వెన్షన్ వేదికగా ప్రమాణ.స్వీకారం చేశారు . ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఆర్యవైశ్య రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొని పసుమర్తి చందర్ రావు చే ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం పాలకవర్గం తో పాటు సాంస్కృతిక విభాగం సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహిళ అధ్యక్షురాలుగా దోసపాటి సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని, ఆర్థికంగా వెనకబడిపోయిన ఆర్యవైశ్యులను ఆదుకోవాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా పాగా వేయాలని కోరారు.రాజీవ్ యువ వికాసంలో ఆర్యవైశ్యులకు ఈడబ్ల్యూఎస్ 10 శాతం అవకాశం కల్పించారాని, అందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పసుమర్తి మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన నా ఆర్యవైశ్యుల కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటానని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్యవైశ్యుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద,జిల్లా ప్రధాన కార్యదర్శి వనమా కిరణ్ కుమార్, కోశాధికారి పసుమర్తి వెంకటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి కొప్పరపు బలరాం, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగిశెట్టి గంగాధర్ జగదీష్ కుమార్, అధికార ప్రతినిధి చలువాది నగేష్ కుమార్, మెంబర్షిప్ చైర్మన్ పసుమర్తి గోపాలరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పసుమర్తి రాంబాబు, కల్లూరు మండల ఆర్యవైశ్య అధ్యక్షులు అనుములు శ్రీనివాసరావు, 21 మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వహణ సభ్యులు అధిక సంఖ్యలో ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.




CEO
Mslive 99news
Cell :7569615143