- బీఆర్ యస్ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు
- పేకాట,జూదం,కోడి పందాలు కు కేరాఫ్ బీఆర్ యస్
- తప్పు చేస్తే మా నాయకుడికి ఎవరైనా ఒకటే
- మీలాగ మహిళలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం
ఏఎంసి చైర్మన్ భాగం నీరజ చౌదరి
కల్లూరు జూన్08 Mslive 99news .కల్లూరు యస్ ఐ.హరిత పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం అని ఏయంసీ ఛైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి అన్నారు. మహిళా ఎస్సై పై దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ తల్లాడ మండల నాయకులు రాయల రాము ఆయన అనుచరులు పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలే ఉంటాయని నీరజ అన్నారు. మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. యస్ ఐ పై జరిగిన దాడిని బీఆర్ యస్ నాయకులు అవకాశం గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు.మా ఎమ్మెల్యే మట్టా రాఘమయి రాష్ట్ర నాయకులు దయానంద్ ఇటువంటి వాటిని ప్రోత్సహించరని అన్నారు .మీ బీఆర్ యస్ పాలనలో మహిళలకు ఎలాంటి గౌరవం ఉందనేది అందరికీ తెలుసు అని అన్నారు.దందాలు,దాదాగిరి, బెట్టింగ్ లకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ యస్ అని బాగం నీరజ ప్రభాకర్ చౌదరి అన్నారు.మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు .ఈ కార్యక్రమం లో కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



CEO
Mslive 99news
Cell :7569615143