Home Uncategorized మహిళా ఎస్సై తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

మహిళా ఎస్సై తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు: పోలీస్ కమిషనర్

by MS LIVE 99 NEWS
0 comment
3,235 Views

కల్లూరు : విధి నిర్వహణలో వున్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళ ఎస్సై హరిత తో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.వివరాల్లోకి వెళితే తల్లాడ గ్రామానికి చెందిన రాయల రాము తో పాటు కొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు పట్టణం ఎన్నెస్పీ క్రాస్ రోడ్డులోని చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు . ఈనేపథ్యంలో క్రైమ్ నెంబరు 102/2025 U/s 329(4), 296(b), 79, 189 (2) r/w 190 BNS కేసు నమోదు చేసి, అట్టి కేసు విచారణ నిమిత్తం ఘటన ప్రాంతానికి ఎస్సై వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న రాయల రాము,తన అనుచరులతో మరల హోటల్ వద్దకు వచ్చి సాక్ష్యాలుగా ఉన్న హోటల్ సిబ్బందిని మరియు యజమానిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానని హోటల్ నడవనివ్వనని హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారంతో ఎస్సై తన పోలీస్ సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్ళిగా ఎస్సై ఎదురుగానే రాయల రాము తో పాటు అతని అనుచరులు మద్యం మత్తులో గొడవ చేస్తున్నారని, వారిని అక్కడి నుండి పంపించి కేసు విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్సై హరిత వారిని పంపించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో రాయల రాము మరియు అతని అనుచరులు డ్యూటీలో ఉన్న మహిళా అధికారి విధులకు ఆటంకపరుస్తూ ,దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారని తెలిపారు. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్సై హరిత ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U1s 74, 189, 191 (2), 195, 132, 351(2) 2/2 190 BNS. See 7 (1) మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం పదిమందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందుతుడు రాయల రాముతో పాటు మొత్తం ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో రాయాల రామారావు పై తల్లాడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు అయిందని తెలిపారు.

                    

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird