- పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు దొరుకుతుందని నాయకుల ఆశాభావం

ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి నటరాజన్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు.జిల్లా పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నటరాజన్ పార్టీ కోసం పనిచేసేవారికే ప్రతి చోటా గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు.కానీ ఎంతో మంది పార్టీ ని నమ్ముకున్న వారు చాలా మంది పార్టీ తమని గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు, రాష్ట్రంలో ప్రతి చోటా ఇదే కనిపిస్తుంది. పార్టీ ఓటమి కోసం పనిచేస్తున్న,పనిచేసిన వారే అందలమెక్కటం పార్టీ కి నష్టం వాటిల్లే అంశం గా చెపుతున్నారు.సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని లంకపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నున్నా రామక్రిష్ణ పార్టీకోసం నలభై ఏళ్ల పైగా పోరాటం చేస్తున్న ఎటువంటి గుర్తింపు లేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆయన్ని నమ్ముకున్న వారికోసం ఎంత వరకైన వెళ్ళే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ తప్ప మరో జెండా పట్టని నాయకుడని, రాహుల్ గాంధీ జోడో యాత్ర లో పాల్గొనడం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర లో కూడా తనదైన ముద్ర వేశారు.అంతే ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.గతంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీ లో కీలకంగా పనిచేశారు.ఇప్పుడు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం లో ఆయన వెంట పయనిస్తున్న నున్నా రామక్రిష్ణ పనితీరును చూసి కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని, ఆయన అభిమానులు కాంగ్రెస్ వాదులు కోరుకుంటున్నారు








CEO
Mslive 99news
Cell :7569615143