
కల్లూరు : ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న హైవే నిర్మాణ పనులు పరిశీలనలో భాగంగా కల్లూరు మండలం లింగాల గ్రామం వద్ద హైవే ఎగ్జిట్ వద్ద పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయానంద్ తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మట్టా రాఘమయి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ ఇంత వరకు రాలేదని అన్నారు.దేశంలో ఇప్పటివరకు ఏ నియోజకవర్గం లో మూడు చోట్ల ఎగ్జిట్ ఇవ్వలేదని కానీ మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యే నెంబర్ వన్ అని అందుకే ఇక్కడ మూడు చోట్ల ఎగ్జిట్ కుదిరిందని అన్నారు.పట్టు పట్టి ఎమ్మెల్యే రాగమయి మూడు ఎగ్జిట్ లు అడగడం వలన నాకు చేయించే అవకాశం లభించింది అని అన్నారు.జూలై మొదటి వారం కల్లా హైవే నిర్మాణ పనులు పూర్తి అవుతాయి అని మంత్రి తుమ్మల అన్నారు.అగస్ట్ 15 కి గ్రీన్ ఫీల్డ్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వా దుర్గా ప్రసాద్, గిడ్డంగులు సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, కల్లూరు ఏయంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్,దోమ ఆనంద్, కల్లూరు మండల నాయకులు ఏనుగు సత్యంబాబు,ఆళ్ళకుంట నరసింహారావు,లక్కినేని క్రిష్ణ, పసుమర్తి చందర్ రావు, తక్కెళ్ళపాటి ధుర్గాప్రసాద్, సుజలా రాణి, బుక్కావేణీ, పెద్ద బోయిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell :7569615143