కల్లూరు : పట్టణం లో మదిర రోడ్డులో గల డి యన్ పీ కన్వెన్షన్ హాల్ నందు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు అధ్యక్షతన నిర్వహించిన మండల బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు,అనంతరం రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదర్శ లో మేరకు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ జరుగుతుందని ఆయన అన్నారు. 10 లక్షల మంది తో జరిగే ఈ సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు కల్లూరు మండలం నుంచి పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు కదలిరావాలని వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.తదనంతరం సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించాబోతున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని సండ్ర పిలుపునిచ్చారు.
ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ఉదయం పార్టీ జెండా ఆవిష్కరించాలని, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకు దిశానిర్దేశం చేశారు.
వరంగల్లో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు ఊరూరు నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అభిమానులు తరలి రావాలని తెలిపినారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి విధానాలను ఎండగట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా ప్రతీ కార్యకర్త పని చేయాలని అన్నారు.బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే ప్రతీ ఒక్కరూ కష్టపడి పని చేయాలని కోరారు.ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేయకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు,రుణమాఫీ,రైతు భరోసా పథకాల్లో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని అన్నారు.తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ పనులు ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని ఎక్కడ విందాంమన్న ఇప్పటికే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతున్నారని అన్నారు.ఆస్తులు అమ్మడం అప్పులు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని విమర్శించారు.అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు రామారావు మాజీ జడ్పిటిసి సభ్యులు కట్టా అజయ్ కుమార్ మాజీ యం పీ పీ సభ్యులు బీరవల్లి రఘు, నర్వనేని పెద్ద అంజయ్య లక్కినేని రఘు దేవరపల్లి భాస్కరరావు మేకల కృష్ణ మండల బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ బోబోలు లక్ష్మణరావు సింగిశాల ప్రసాద్ కాటమనేని వెంకటేశ్వరరావు కొరకొప్పు ప్రసాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు


CEO
Mslive 99news
Cell :7569615143