
పామాయిల్ ఫ్యాక్టరీ కు దారికి భూములు అందించిన రైతు సోదరులకు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్
సత్తుపల్లి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుమరియు సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కృషి తో నూతన పామాయిల్ ఫ్యాక్టరీ సత్తుపల్లి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు.ఈ నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం వలన వేంసూరు మండలం మరియు కల్లూరు గూడెం గ్రామం ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా రైతు సోదరులకు ఈ పామాయిల్ ఫ్యాక్టరీ ఓ గొప్ప వరం లాంటిదని తెలిపారు.. ఈ పామాయిల్ ఫ్యాక్టరీని కల్లూరు గూడెం లో నిర్మించడం మండలంలో మరియు చుట్టుపక్కల పామాయిల్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు కి ధన్యవాదాలు తెలిపారు . ప్రజలు ఎటువంటి అపోహాలు పెట్టుకోవద్దని ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నూతన టెక్నాలజీ తో నిర్మించడం జరుగుతుందని ఎటువంటి కాలుష్యం వాటిల్లదని తెలిపారు.కల్లూరు గూడెం లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించడం వలన స్థానిక నిరుద్యోగులకు నాన్ టెక్నికల్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో MLA గా మేము గెలిచిన తర్వాత నూతన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం మరియు నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం మా అదృష్టం .. ఇది రైతు సోదరులకు, విద్యార్థులకు అందుతున్న ఓ గొప్ప వరం.సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయి కృషి అభినందనీయం.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ AMC చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అధికారులు, సత్తుపల్లి నియోజకవర్గం 5 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు,వేంసూరు మండలం, కల్లూరు గూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వేంసూరు మండలం, కల్లూరుగూడెం రైతు సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు..

CEO
Mslive 99news
Cell :7569615143