

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో వెల్లటూరి ప్రసాద చారి స్వామి ఆధ్వర్యంలో సుమారు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో శ్రీ మోక్ష రుద్రేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తి దశకు చేరింది. ఈ దేవాలయంలో యాగశాల, వేద పాఠశాల, గోశాల, మరియు ఏకాదశరుద్రులు, నవగ్రహ దోషాలకు సంబంధించి పూజలు చేసుకోవడానికి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, అన్నపూర్ణాదేవి దేవాలయం కలదు.ఈ దేవాలయం పూర్తిగా రాతితో నిర్మితమైంది. సుమారు కోటిన్నర పైగా ఇప్పటికే ఖర్చు జరిగింది. శివరాత్రి సందర్భంగా 108 మంది భక్తులతో శివపార్వతులకళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణములో కూర్చునే జంటలకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా పూజా సామాగ్రి అందించనున్నారు. ఈ దేవాలయంలో ప్రతిష్టించబడిన శివలింగం మరకత శివలింగం. కాశీ నుంచి అక్కడి గంగాజలంతో అభిషేకం చేసి ఇక్కడ ఆలయంలో ప్రతిష్టించడం జరిగింది. శివరాత్రి ఉదయం పూట నుండి అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేక పూజలు భక్తులకు అన్న ప్రసాదంతో పాటు ఇటువంటి ఆ సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని మోక్ష రుద్రేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకులు ప్రసాద చారి స్వామి తెలిపారు.




CEO
Mslive 99news
Cell :7569615143