

తల్లాడ :మేజర్ పంచాయతీ లో కొత్తగూడెం రోడ్ నందు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు .ఈ సందర్భంగా MLA రాగమయి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ,కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు రెండు కళ్ళు గా పాలన చేస్తుందని అన్నారు.సత్తుపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కోసం కస్టపడి,జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాము అని MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు.రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అని, గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా రెప రేపరేపలాడాలి అని అన్నారు .ఈ కార్యక్రమం లో తల్లాడ గ్రామం మరియు తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


CEO
Mslive 99news
Cell :7569615143