
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో.. ఈ కేసు విషయంలో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు.
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ.. అక్టోబర్లో మంత్రి కొండా సురేఖ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా తప్పుబట్టారు. ఇక నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబానికి నష్టం కలిగించేలా మాట్లాడిన సురేఖపై చర్యలు తీసుకోవాలన్నారు. సాధారణంగా నాంపల్లి స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: కాంత మూవీ ఫస్ట్ రివ్యూ
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా.. అక్కినేని కుటుంబం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని చెబుతూ కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.
కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో తాజాగా ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు నాగార్జున. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
